ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సంక్రాంతి పండుగ సందర్భంగా పాములపాడు మండలంలోని, లింగాల గ్రామములో కర్నూలు వారి అక్షయ బ్లడ్ బ్యాంక్, లింగాల యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నవీన్ కుమార్ గౌడ్, తెప్పలి.విష్ణు, తెప్పలి.అశోక్ కుమార్, ఎడిటర్ తుపాకుల.రమేష్, ఎం.అశోక్, శంకర్, శివ, భాస్కర్, భార్గవ్, మదన్, ఇతర యువకులు 2వ సారి రక్తదానం చేసి ప్రాణదాతలు కావడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్సై- పి.తిరుపాలు, గ్రామ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, ఎడిటర్ తుపాకుల.రమేష్ లు సందర్శించి, రక్తదానం చేసిన 32 మంది లింగాల యువకులకు పండ్లు ఇచ్చి, అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ సమాజ సేవా కార్యక్రమాలలో యువకులు ముందుండాలని అన్నారు. రక్తదానంపై ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దని రక్త దానం మరి ఒకరికి ప్రాణదానం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్వచ్చందగా రక్త దానం చేసి, ప్రాణాపాయంలో ఉన్న వారికి భవిష్యత్తును ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగాల యువకులు, అక్షయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News