Sunday, 26 April 2026 12:25:54 AM
# భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్ # ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు. # ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు కీలక మార్పులు చేశాం.. # ఈ నెల 27న ప్రజావాణి రద్దు # ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

మహిళా బిల్లు పార్లమెంటులో వీగిపోయినందుకు సంబరాలు చేసుకున్న మహిళ ఐక్యవేదిక నాయకులు

మేమెంతో మాకు అంత రిజర్వేషన్ల వాటా ఇవ్వాలి..! నంది విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక

Date : 22 April 2026 06:30 AM Views : 65

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : మేమెంతో మాకు అంత వాటా కావాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక నాయకులు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపాదించిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఆధిపత్య వర్గాల మహిళలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలగదని ఆమె అన్నారు. దేశ జనాభాలో వున్న మహిళల జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రత్యేక కోట ఇవ్వాలని ఆమె తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ముందుగా వెనుకబడిన తరగతుల వారి జనాభా లెక్కలు తేల్చి ఆ తర్వాత భారతదేశంలోని మొత్తం జనాభాలో 50% పైగా ఉన్నటువంటి మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాటా ప్రకారం మేము ఎంత మంది ఉన్నామో మాకు అంత వాటా రిజర్వేషన్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే బాగుంటుందని ఆమె అన్నారు. నిజంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా వర్గాల జనాభా లెక్కలు తేల్చిన తర్వాతనే రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచన చేయాలని అని ఆమె అన్నారు. ఆధిపత్య కులాల మహిళలకు ఉపయోగపడే బిల్లు వీగిపోయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆమె తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :