Friday, 17 April 2026 03:44:41 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై చర్యలు తీసుకోండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు లింగాల నాగరాజు

Date : 20 November 2025 10:14 PM Views : 908

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని, డిగ్రీ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- ఎల్.నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కే.నాగన్న తో కలిసి సందర్శించి మాట్లాడుతూ సోమవారం మొదులుకొని శుక్రవారం వరకు రోజు ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వకుండా పిల్లల నోర్లు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పెరుగుకు బదులు పలచని మజ్జిగ పోస్తున్నారని పిల్లలు పలచటి చారు, పెరుగుకు బదులు పలచని మజ్జిగ పెడుతున్నారని, అది తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మెనూ ప్రకారం ఆహారం ఏది సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. నాలుగు బాత్రూములు ఉంటే రెండు బాత్రూంలలో మాత్రమే నీరు వస్తుందని, 9 రూములలో ఒక్క రూములో మాత్రమే కరెంటు ఉందని, ఆ రూములోనే పిల్లలందరూ రాత్రివేళ నిద్రించడానికి సరైన సౌకర్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ కు రావడం లేదని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల బాగా చదువుకుంటారని తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలితే ఎవరు ప్రశ్నించరని వార్డెన్లు వాళ్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టకుండా, సరిగ్గా చూసుకోకపోయినా వార్డెన్లను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :