ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్ర అధికారి శివశంకర వరప్రసాద్ ప్రజలకు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా బుధవారం మంథని పట్టణంలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్, అంబేద్కర్ నగర్ తో పాటు వివిధ రద్దీ ప్రాంతాలలో కరపత్రాలు పంచుతూ వారికి అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు.
వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరి కోతలు జరుగుతున్న సందర్భంలో రైతులు వరిగడ్డిని కాల్చకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అగ్నిమాపకుడు సదానందం, వాహన చోదకుడు రమేష్, అగ్నిమాపకుడు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News