Friday, 31 July 2026 01:20:32 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి..

పిఆర్టియూ జిల్లా నాయకులు

Date : 08 January 2026 05:32 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ఎన్నికల విధుల శిక్షణ మాస్టర్ ట్రైనర్ల ఎంపి కలో పారదర్శకత పాటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ-టీఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిర్యాల సతీష్ రెడ్డి, చాగర్లముడి శ్రీధర్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారని, రాబోయే మునిసిపల్, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలని కోరారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మాస్టర్ ట్రైనర్లుగా నియమించడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎస్సెస్సీ విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకొని గతంలో 2018-2019 శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలల్లో మాస్టర్ ట్రైనర్లుగా విధులు నిర్వహించిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఒకే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేయడం వలన ఇతర ప్రాంత ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని మున్సిపల్,యంపిటీసి,జెడ్పీటిసి ఎన్నికలకు, జనగణనకు శిక్షణ కొరకు మాస్టర్ ట్రైనర్ ల ఎంపికలో అన్ని మండలాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, సంఘ బాధ్యులు దోమల లింగన్న, వెంకట్ రెడ్డి, కరుణాకర్, హాల్య, నాగరాజు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :