ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని రాజుర గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు బుధవారంతో ముగిశాయి. గ్రామంలోని యువతులు, చిన్నారులు ఎంతో సంతోషంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేసి ఆకట్టుకున్నారు. ముగ్గులు పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మొదటి బహుమతి రాథోడ్ శ్రీ ప్రియ, రెండవ బహుమతి మధుమిత, మూడవ బహుమతి రాధికలకు కుటుంబ సమేతంగా కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లప్పుడూ గ్రామమంతా కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలని, ఎంతో చక్కగా యువతులు ముగ్గుల పోటీల్లో హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాదవ్ గణేష్, సర్పంచులు సరోజి, జాదవ్ సునీత రమేష్, సవాయి రాం, జాదవ్ ధన్ రాజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News