Friday, 17 April 2026 03:48:58 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

జగిత్యాల లో ఈనెల 20న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ కు ఏర్పాట్లు..

Date : 11 April 2026 10:12 PM Views : 37

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డిఈనెల 20న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆర్‌సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్,ఎల్ రమణ వెల్లడించారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్, హాజరవుతుండగా నాయకులు భారీ ఏర్పాట్లు0 చేస్తున్నారు.గురువారం ఎర్రవల్లి లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి, భేటీ అయిన సంగతి పాఠకులకు తెలిసిన విషయమే... జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్ .ఆర్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్,మోతే రోడ్డు, ఇతర కాలేజీ ప్రాంగణాల ను నాయకులు పరిశీలిం చారు. బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సభకు ముందే జగిత్యాల లో నిర్వహించే భారీ బహిరంగ సభలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యల తో ప్రజా సమస్యలపై బహి రంగ సభ నిర్వహించబోతు న్నామని వెల్లడించారు. కేసీఆర్ తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు రావడం సంతోషమని వివరించారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని, ప్రజా సమస్యలపై ఇకపై నిరంతరం పోరాటం చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు,కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీఎల్ రమణ,బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :