ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని మంథని విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎవరి పేరు చెపితే శత్రువుల పదాల కింద మట్టి కదిలిపోయి వనికి పోయేవారో అతని పరాక్రమము రాణ నీతిని రాజకీయ చతురతను శిలమును చూసి భయంతో బ్రతికారో తమ కష్టాలు తీర్చిన నాయకుడికి భారతీయ ప్రజలు జేజేలు పలికారో ఆ సంఘటన కర్త న్యాయ కోవిదుడు 360 కోటలను జయించిన మహయోధుడన్నారు. నేడు హిందువులందరు సంతోషంగా ఉన్నారంటే అనాడు ఛత్రపతి శివాజీ మహారాజు చేసిన వీరోచిత పోరాటం, మొగలుల పై సాధించిన విజయాలే కారణమన్నారు. హిందుత్వం ఇప్పటివరకు ఇలా ఉంది అంటే సజీవ సాక్ష్యం ఛత్రపతి శివాజీ మహరాజ్ మరాఠా సామ్రాజ్యాధిపతి అంటేనే హిందువుల పౌరుషమని ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, ప్రచార ప్రముక తూర్పాటి రాము, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్ గుప్తా, దొరగోర్ల రవీందర్, సత్సంగ ప్రముక మెడగొని రాజమౌళి గౌడ్, వడ్ల కొండ శ్రావణ్, ఎల్లంకి హరి, కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, లక్కిరెడ్డి అన్వేష్, భజరంగ్ దళ్ సంయోజక్ రాజేష, సందీప్, సిల్వేరి రవీందర్, బీమారపు శ్రీకాంత్ గుప్తా, దీగేంబర్, సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News