ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ కాలేజీయ్యేట్ ఎడ్యుకేషన్ జెఏసి (టీీజీఈజేఏసీ) చైర్మన్ డాక్టర్ సురేందర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ పరమైన అన్ని ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం టీీజీఈజేఏసీనిర్ణయించిన కార్యాచరణలో భాగంగా భోజన విరామ సమయంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించమన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వంసానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యు జి సి పే స్కేల్ ఉద్యోగులకు పి ఆర్.సి. బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా సిబ్బంది ఐక్యంగా పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా మహాత్మా సంతోష్, అధ్యాపకులు జాడి శంకరయ్య, డా.సంతోష్ కుమార్, డా.తన్నీరు సురేష్, డా.తిరుపతి, ప్రేమలత నాగేశ్వర్ , చంద్రశేఖర్, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, సత్యనారాయణ, నివేదిత బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News