Friday, 17 April 2026 03:46:44 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

డీ లిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం...

సీఎం రేవంత్ రెడ్డి

Date : 13 April 2026 08:26 PM Views : 25

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా రిజర్వేషన్ బిల్లు కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు . లోకసభ సీట్ల పెంపు విషయంలో భిన్న భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ( ఎక్స్) సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళా రిజర్వేషన్లకు అందరూ మద్దతు ఇస్తా రని, కానీ దాని ముసుగు లో లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. కేవలం జనాభా ప్రాతిపది కన లోక్‌సభ సీట్లు పెంచా లని చూడటం దక్షిణాది రాష్ట్రాలకు మరియు చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవి ష్యత్తు లో దేశ సమాఖ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపు అనేవి పూర్తిగా భిన్నమైన అంశాలని దేశ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం హర్షిస్తుందని ఆయన సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :