ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 9 ఆదివాసి పోరు గర్జన సభ అనుమతిని కోరుతూ వారం రోజుల క్రితమే ఎస్పీ కి వినతి పత్రాన్ని అందించిన విషయం విధితమే, కాగా పంచాయితీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సభ వాయిదా వేయమని సంబంధిత అధికారుల కోరిక మేరకు తుడుందేబ్బ నాయకులు చర్చించి ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.ఈ విషయం పై తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ మారుతీ, ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ నితిఖ పంత్ నుకలసి లిఖిత పూర్వకంగా వ్రాసి తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు తీర్మానాన్ని అందజేశారు. త్వరలోనే ఆదివాసి పోరు గర్జన భారీ బహిరంగ సభ తేదీని తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News