ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ, కుమార స్వామికి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని అంత ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక అడుగులు వేశారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి , సహాయ మంత్రి శ్రీనివాస వర్మలతో ఈరోజు భేటీ అయిన ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతి ష్టాత్మక ప్రతిపాదనలను వారి ముందుంచారు. ముఖ్యంగా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమ స్థాపన ద్వారా ఉక్కు కొరత తీరడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుం దని ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రణాళికలను వివరిస్తూ, పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే సరికొత్త పరిశ్రమను తెలం గాణలో నెలకొల్పాలని కేంద్ర మంత్రులను కోరారు. హైదరాబాద్ నగరాన్ని దేశ పారిశ్రామిక ఉత్పత్తికి కంచుకోటల మార్చేందుకు ఉన్న అనుకూలతలను సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటోమొబైల్ , రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరి శ్రమలను ప్రోత్సహించా లని కోరారు. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగాపెరుగుతున్న నేపథ్యంలో, ఈవీ బ్యాట రీల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన వివరించారు. ఈ కీలక భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు , కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. సీఎం చేసిన వినూత్న ప్రతిపాదనలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Admin
E Nivas News