ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని అధ్వర్యంలో మండలంలోని విలోచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కొండ ప్రేమలత - రవీందర్ తోకలిసి మంథని ఏ ఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంథని ఏ ఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ రైతులు అరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు విక్రయించరాదని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, నాయకులు సాదుల శ్రీకాంత్, ఎరుకల ప్రవీణ్, పర్శవేణి మోహన్, కోరవేన రవి కుమార్, రైతులు, సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News