Friday, 31 July 2026 01:21:01 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండించండి

Date : 12 October 2025 07:24 PM Views : 327

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దేశ అత్యున్నత మైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడి చెయ్యడానికి సిద్దపడటం సరి కాదని దాన్ని సనాతనం తో ముడిపెట్టడం దివాలు కోరు రాజకీయమని వెంటనే అతనిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చెయ్యాలని కోరుతూ ఆదివారం లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి దేవి పోచన్న మాట్లాడుతూ సనాతన దర్మం పేరిట హింసను ప్రోత్సహస్తే సనాతన దర్మం కూడా ఒప్పుకోదని, సనాతన దర్మం పేరిట దాడులు, చంపడాలు, బెదిరింపులు బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగాయని, సనాతన దర్మం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది తప్పుడు ఉద్దేశ్యమని కావున సనాతన ధర్మం పేరిట దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోట్లాది హిందువులు ఆరాధించే సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన హిందూ మతానికి తప్పుడు అర్ధం ఇచ్చిన చిన్నజీయర్ ను ఏమనలేదని ఎందుకంటె అయిన బ్రాహ్మణుడని,అదే బ్రాహ్మణుడు పై ఇలాంటి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక దళిత బిడ్డ ఉన్నత స్థానంలో కూర్చోవడం సహించలేని ఆధిపత్య కుల దురహంకారమే ఆ రాకేష్ కిషోర్ ను ఉసిగొలిపిందన్న సత్యం అందరికీ అర్థమవుతుందని మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. గవాయి గారిపై జరిగిన దాడి ప్రపంచ దేశాల ముందు భారత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి కి జరిగిన అవమానం అన్నారు. ఇది న్యాయమూర్తి పై జరిగిన దాడి కాదని రాజ్యాంగం పై,బావ వ్యక్తికరణ పై జరిగిన దాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు దేవి జగన్, ఆవునూరి మురళి, అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి ఆవునూరు ప్రసాద్, నాయకులు కామిల్ల రమేష్, దేవి భీమయ్య ఉరిమెట్ల అరవింద్, ఆదర్శ్, పల్లికొండ శ్రీనివాస్, ఆవునూరు రమేష్, దేవి సిద్దు దానపెళ్లి జమీస్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :