Thursday, 30 July 2026 06:42:34 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడిని ఖండించండి

Date : 12 October 2025 07:24 PM Views : 324

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దేశ అత్యున్నత మైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడి చెయ్యడానికి సిద్దపడటం సరి కాదని దాన్ని సనాతనం తో ముడిపెట్టడం దివాలు కోరు రాజకీయమని వెంటనే అతనిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చెయ్యాలని కోరుతూ ఆదివారం లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి దేవి పోచన్న మాట్లాడుతూ సనాతన దర్మం పేరిట హింసను ప్రోత్సహస్తే సనాతన దర్మం కూడా ఒప్పుకోదని, సనాతన దర్మం పేరిట దాడులు, చంపడాలు, బెదిరింపులు బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగాయని, సనాతన దర్మం పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది తప్పుడు ఉద్దేశ్యమని కావున సనాతన ధర్మం పేరిట దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోట్లాది హిందువులు ఆరాధించే సమ్మక్క సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన హిందూ మతానికి తప్పుడు అర్ధం ఇచ్చిన చిన్నజీయర్ ను ఏమనలేదని ఎందుకంటె అయిన బ్రాహ్మణుడని,అదే బ్రాహ్మణుడు పై ఇలాంటి దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక దళిత బిడ్డ ఉన్నత స్థానంలో కూర్చోవడం సహించలేని ఆధిపత్య కుల దురహంకారమే ఆ రాకేష్ కిషోర్ ను ఉసిగొలిపిందన్న సత్యం అందరికీ అర్థమవుతుందని మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠినమైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. గవాయి గారిపై జరిగిన దాడి ప్రపంచ దేశాల ముందు భారత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి కి జరిగిన అవమానం అన్నారు. ఇది న్యాయమూర్తి పై జరిగిన దాడి కాదని రాజ్యాంగం పై,బావ వ్యక్తికరణ పై జరిగిన దాడని అన్నారు. ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు దేవి జగన్, ఆవునూరి మురళి, అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి ఆవునూరు ప్రసాద్, నాయకులు కామిల్ల రమేష్, దేవి భీమయ్య ఉరిమెట్ల అరవింద్, ఆదర్శ్, పల్లికొండ శ్రీనివాస్, ఆవునూరు రమేష్, దేవి సిద్దు దానపెళ్లి జమీస్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :