Thursday, 30 July 2026 08:00:09 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

ఆదివాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం ఆపరా..

తుడుం దెబ్బ ఖండన, హక్కు పట్టాల డిమాండ్

Date : 22 June 2026 09:05 PM Views : 72

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లానచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగాతీసుకెళ్లారనిగ్రామస్తులుఆరోపించారు.బాధితులను పరామర్శించిన నాయకులు, పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడమ్ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఇటీవల ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు జరిపిన దాడిని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది.బాధితులను నాయకులు పరామర్శించారు. పోడు భూములకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున అటవీ అధికారులు ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేశారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి, కొందరిని బలవంతంగా తీసుకెళ్లారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆదివాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తుడుం దెబ్బ నాయకత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో నిర్బంధించిన వారిని విడుదల చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోడమ్ గణేష్ మాట్లాడుతూ, పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం వెంటనే ఉమ్మడి హక్కు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులు రాజ్యాంగం, చట్టాలకు లోబడి పనిచేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఆదివాసి గూడాలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. అటవీ అధికారుల వేధింపులు కొనసాగితే ప్రజా సంఘాలను ఏకం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుచేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసి విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోడసం గోవర్ధన్, రాష్ట్ర నాయకులు ఆనందరావు, ఆర్క శేషారావు, సామాజిక కార్యకర్తలు, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిదం జంగు దేవ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :