ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన జీవోపై హైకోర్టు స్టే జారీ చేయడం, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎంపీ ఆర్. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంద్కు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, సంస్థలు మద్దతు తెలిపినట్లు తెలిపారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఇది కీలక సమయం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా అందరం ఐక్యంగా నిలబడి బంద్ను విజయవంతం చేయడం ప్రతి బీసీ వర్గపు బాధ్యత అన్నారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా నిరసనలు తెలుపాలని ఆయన బీసీ సంఘాలను కోరారు.
Admin
E Nivas News