ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం లక్షెట్టిపేట బాలిక ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ముందుగా వంటగది సరుకులు కూరగాయలు తదితర సామాగ్రిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి వంటగది టాయిలెట్స్ డార్మెటరీ నీటి సౌకర్యం తదితర విషయాలను పరిశీలించి తగు సూచనలు అందజేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యా బోధన చేస్తున్నారా అని పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు గురువులు తమ విద్య పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారని ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరిస్తున్నారని చెప్పడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పశువులు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండజీవరత్నం, వసతి గృహ సంక్షేమ అధికారిని రేణుక ఉపాధ్యాయులు మాడావిశంకర్, రజిత, మంజుల, వినోద,అనసూయ ఏఎన్ఎం సుమిత్ర విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News