ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి రైతులు తమ వరి ధాన్యం కుప్పల వద్ద పడుకున్నారు. శుక్రవారం రాత్రి ఆకాలంగా గాలి వర్షం రావడంతో పక్కనే ఉన్న షెడ్డులోకి గంపల పల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు అతని కుమారుడు అభిరామ్ లో అక్కడికక్కడే మృతి చెందగా కొత్తూరు గ్రామ జాతీయ రహదారి పక్కన వరి ధాన్యం కుప్పల వద్ద గుండారపు వెంకటేష్, నెల్కి లచ్చన్నలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వారిని చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషయం ఉంచడంతో వారిని మంచిర్యాల తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అకాల వర్షాల నుండి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడేందుకు రైతులు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారని పలువురి రోదనలు మిన్నంటాయి.
గత వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం కారణంగా మొత్తంగా 4 గురు రైతులు మృత్యువాత పడ్డారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భారీగా ఎదుర ఈదురు గాలులు రావడంతో జన్నారం నుండి హాజీపూర్ వరకు జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడం ఏర్పడడంతో సమాచారం అందుకున్న వెంటనే సిపి తో పాటు ఏసిపి పోలీసులు సంఘటన స్థలాలకు చేరుకొని భారీ గ్రీన సాయంతో వృక్షాలను తొలగించి ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చేశారు. ఏది ఏమైన వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న తీరు పలువురుని కలిసి వేసింది.
Admin
E Nivas News