ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిలేదని, లక్షెట్టిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెల్ల నాగభూషణం పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలోని ఒకటి, రెండు, మూడో వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఫ్రీ బస్, ఉచిత కరెంటు, లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ సర్కార్ అన్నారు. పేదలకు అండగా నిలిచింది కాంగ్రెస్సర్కారెనన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి దొంత అంజలి, నర్సయ్య, తొగరు రాజు, పెట్టెం శ్రీనివాస్, కట్ల చంద్రయ్య, దామెర మహేందర్, కండె మొగిలి, బత్తుల రాజు తొగరు దేవయ్య, అసాది శ్రవణ్, తొగరు రాకేష్, అసాది సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News