Thursday, 30 July 2026 07:19:38 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

గ్రంథాలయమే జ్ఞాన మార్గానికి మార్గదర్శి...

ఘనంగా గ్రంథాలయ జ్ఞానోత్సవం

Date : 15 May 2026 10:52 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జరుగుతున్న విద్యావారోత్సవాల్లో అయిదవ రోజైనా శుక్రవారం మన గ్రంథాలయ జ్ఞానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో కళాశాల లైబ్రేరియన్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో కళాశాల గ్రంథాలయం వెబ్ సైట్ ప్రారంభం, బుక్ ఎగ్జిబిషన్, పుస్తకాల విరాళం , కొత్త పుస్తకాల ఆవిష్కరణ, పుస్తక సమీక్షలు విద్యార్థులకు పోటీలు ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ కళాశాల గ్రంథాలయం గూగుల్ వెబ్ సైట్ తో పాటు బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞానం పెంచడానికి మార్గదర్శిగా పనిచేస్తాయన్నారు. ఒక్కో పుస్తకం ఒక్కో జీవితాన్ని పరిచయం చేసి సమున్నతమైన ప్రతిభ పొందడంలో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు .విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగ పరుచు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల తెలుగు అధ్యాపకులు రచించిన వెన్నెల సాహచర్యం ఈ - పుస్తకాన్ని, తెలుగు విభాగం నిర్వహించిన సృజనాత్మక రచన కార్యశాల సావనీర్ పుస్తకాన్ని ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. విద్యార్థులు సృజనాత్మక రచనలో ప్రావీణ్యం సంపాదించాలని పేర్కొన్నారు. లైబ్రేరియన్ నాగేశ్వర్రావుమాట్లాడుతూ గ్రంథాలయాన్ని ప్రతిరోజు సందర్సించడం ద్వారా పుస్తకాలు మాత్రమే కాకుండా డిజిటల్ లైబ్రెరీ వాడకాన్ని కూడా అలవర్చుకోవాలని ప్రపంచంలోని పుస్తకాలన్నీ ఉచితంగా సౌకర్యం డిజిటల్ లైబ్రెరీ కల్పింస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం అధ్యాపకులు ప్రజలు పుస్తకాలను లైబ్రెరీలకు విరాళంగా ఇవ్వాలని కోరారు. పలువురు అధ్యాపకులు గ్రంథాలయ జ్ఞానోత్సవం సందర్భముగా కాలేజీ లైబ్రెరీకి విలువైన పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. గ్రంథాలయాన్ని రోజు సందర్సించిన ఉత్తమ విద్యార్థులకు పుస్తకాలను బహుమతులుగా ఇచ్చారు .కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్, లైబ్రేరియన్ నాగేశ్వర్ రావు తో పాటు అధ్యాపకుల శంకరయ్య , ప్రేమలత, తన్నీరు సురేష్, తిరుపతి, శ్రీనివాస్, రాజ్ కుమార్, కవిత, సంధ్యారాణి , స్వప్న, స్వామి , ప్రసన్న, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: