ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కందులపురం జమీందారు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు 23-11-1906లో తల్లిదండ్రులైన తమ్మిశెట్టి వెంకటప్పయ్య తల్లి లక్ష్మీదేవమ్మా దంపతులకు జన్మించారు. ఈయన వడియరాజుల ఆరాధ్య దైవం, వడియరాజ క్షత్రియ సంఘం 1942లో స్థాపకుడిగా పేరుపొందారు. శ్రీదేవి మూలిక ఫార్మసీ ద్వారా పనుల్లో గాయపడిన కార్మికులకు స్వయంగా వైద్యం చేసి మరీ సేవ చేశారు. మహిళా గౌరవ పరిరక్షకుడిగా ఆ కాలంలో ఉన్న కట్టు, బొట్టు, వేషధారణలో మార్పులు చేసి స్త్రీ శక్తి, స్త్రీ గౌరవం అనే విలువను సమాజంలో నిలబెట్టారు. గోత్రాలు, వరుసలు ఆధారంగా సక్రమమైన వివాహ వ్యవస్థను బలపర్చి కుల ఐక్యతను పెంచారు. 'ఐకమత్యమే మహా బలం' అని చెబుతూ వడియరాజుల మధ్య అపార ఐక్యాన్ని నెలకొల్పారు. తన భూములు సంతానానికి కాకుండా వడియరాజులలోని నిరుపేదలకు దానం చేశారు.1942లో వడియరాజ క్షత్రియ సంఘ స్థాపకుడు చేసి, జీవితాన్ని అప్పగించి కుల అభివృద్ధికి అంకితం చేశారు. చెప్పులు లేకపోయినా గ్రామాలు తిరిగి జాతి అభ్యుదయానికి కృషి చేశారు. పేదలకు అన్నదాన సేవలు చేస్తూ తమ ఇంటి వద్ద పేదలకు నిత్యం అన్నదానం నిర్వహించారు. వడియరాజుల చరిత్రను వారి మూలాలను పరిశోధించి వంశ చరిత్రను సంరక్షించిన వాడు. పెళ్లిళ్లకు బంగారు తాళిబొట్టు దాతగా అనేక పేద కుటుంబాల పెళ్లిళ్లకు బంగారు తాళిబొట్టు దానం చేశారు. తుది శ్వాస వరకు సమాజ సేవ చేసి జీవితం మొత్తం వడియరాజుల అభివృద్ధికే అంకితమై గడిపారు.
"స్త్రీకి గౌరవం లేని కాలంలోనే వడియరాజ క్షత్రియ మాతకు జై!" అనే నినాదంతో ప్రజలను ఉత్తేజపరిచారు. రేడియో కూడా విస్తరించని రోజుల్లో చైతన్య యాత్రలు చేసి రాష్ట్ర నలుమూలలకు తిరిగి సామాజిక అవగాహన, చైతన్యం కల్పించారు. తిరుమలలో ఏనుగుపై ఊరేగే హక్కు కేవలం శ్రీ వెంకటేశ్వరస్వామికి మాత్రమే ఉన్న రోజులలోగజ రాజుపై ఊరేగిన గజపతిరాజు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు బ్రిటిష్ పాలనలోనే ఏనుగుపై భారత జాతీయ జెండా ఎగురవేసిన స్వాతంత్య సమర వీరుడు. బ్రిటిష్ అధికారిని చెట్టుకు కట్టించిన సంఘటన తరువాత గద్వాల్ మహారాణి సన్మానించారు. తరువాత మైసూరు పాలస్ చల్లా రోసిరాజ వడియర్ ప్రత్యేక ఆహ్వానం అందించారు. వడియరాజుల శ్రీనాథునికి అవమానం చేసిన వంశంలో పుట్టినా, తానే ముంగర మల్లిఖార్జున రాజును కవి సార్వభౌముడిగా తీర్చిదిద్దిన మహాగురు. గిరిపురంలో పెద్ద సభ ఏర్పాటు చేసి అనేక మంది జమీందారులు, పండితులు, వడియరాజ నాయకులను ఆహ్వానించి స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ సమావేశానికి హాజరైన ప్రముఖ 48 మంది జాబితా చరిత్రలో నిలిచిపోయింది. 'వడియరాజుల ఆత్మగౌరవాన్ని' తిరిగి నిలబెట్టి, భూములు దానం చేసి, బ్రిటిష్ పాలనలోనే ఏనుగుపై జాతీయ జెండా ఎగురవేసిన మహాయోధుడు కందులపురం తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు. ఈయన వడియరాజుల మూల పురుషుడిగా ప్రఖ్యాతి చెందారు --డా.ఓర్సు రాయలింగు 9849446027
Admin
E Nivas News