Friday, 31 July 2026 01:53:06 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల రిలే నిరహార దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే...

Date : 20 May 2026 10:29 PM Views : 79

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్టాఫ్ గేట్ ఎదురుగా బుధవారం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో మొదలుపెట్టిన రిలే నిరహార దీక్షక సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలని, కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లాకు వస్తున్న ఇంచార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రులు పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల రూ.100కోట్ల సబ్సిడీ బిల్లులు ప్రభుత్వం నుంచి తీసుకున్న యాజమాన్యం కార్మికులకు కనీసం వసతులు కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేరే రాష్ట్రాల వారిని తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడం దారుణం అన్నారు. కార్మికుల ఐక్య పోరాటాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విశ్వేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ సిందం శ్రీనివాస్, నాయకులు సాయి చరణ్, మిల్లు కార్మికులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :