ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ సందర్శించి, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, ప్రతి పని సమయానికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సురక్షితమైన, ఆధునిక సౌకర్యాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, కూర్చునే సదుపాయాలు, లైటింగ్, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదనంగా, వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు స్పందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని గట్టిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News