Thursday, 30 July 2026 06:08:54 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేయాలి...

సీఎం రేవంత్ రెడ్డి

Date : 11 March 2026 10:38 PM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రోడ్లు&భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు,పురోగతిపై స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీనగరంగాతీర్చిదిద్దేందుకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలను గుర్తించి అమలు చేయాలని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ,రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రంలో రింగ్ రోడ్ల అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేసి,ఆ రింగ్రోడ్లనుజాతీయ,రాష్ట్ర హైవేలకు అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం చేసి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :