Friday, 31 July 2026 03:36:10 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు...

సీఎం రేవంత్ రెడ్డి

Date : 05 April 2026 01:33 PM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు కేరళం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చివరిరోజున అక్కడి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాగాతొలిసారిగా పెదవి విప్పారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపడుతాంఅన్నారు.ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తాంఅని వివరించినట్లు కేరళం మీడియా ప్రతినిధులు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామనే అంశంపై సీఎం అక్కడి మీడియాకు పూర్తిస్థాయిలో తెలియజేశారు. రైతు రుణమాఫీ వల్ల ఎంత మంది రైతులకు ప్రయోజనం కలిగిందో వివరించారు. ప్రతిఏటా రైతు భరోసా స్కీమ్ కోసం ప్రభుత్వం రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటివరకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల వల్ల ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్యను లెక్కలతో సహా వెల్లడించారు. ఎన్నికల బిజీలో ఐసీసీ నేతలు... ప్రస్తుతం ఏఐసీసీ నేతలు పలు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈనెల 9న కేరళం, పాండిచ్చెరి, అస్సాంలో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్‌పై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలోని పెద్దలకు కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు సమయం దొరకడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత రాష్ట్రానికి చెందిన కీలక నేతలను ఢిల్లీకి పిలిపించి కేబినెట్ విస్తరణ, ప్రక్షాళనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కేబినెట్ నుంచి తప్పించే జాబితాపై ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని, కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే నేతల ఎంపికపై చర్చించనున్నట్లు తెలిసింది. ఆ మీటింగ్‌లోనే శాఖల మార్పు అంశంపై సీఎం రేవంత్ తన ప్రపోజల్స్‌ను అధిష్టానం ముందు పెడుతారనే ప్రచారం జరుగుతున్నది. ఊహాగానాలకు తెర పడనున్నది... కేబినెట్ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, అసెంబ్లీ సమావేశాల సమయంలో విస్తరణ అంశాన్ని సీఎం రేవంత్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తవించిన సమయంలో 'కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో అప్పుడేn చేస్తాం' అంటూ వెల్లడించారు. కేరళంలో మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పడంతో ఇంతకాలం వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అదే రాష్టానికి చెందిన ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ప్రచారం బిజీగా ఉండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి తర్వాత విస్తరణ అంశంపై చర్చించి, ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నర ఏండ్లు అవుతుంది. ఇప్పటికీ మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇంకా భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. పైగా ఇంటా, బయట విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడే విస్తరణ, ప్రక్షాళన చేయడం మంచిదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కాగా, కేవలం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేస్తారా, కొందరిని తప్పించి ఆ స్థానాల్లో కొత్త వాళ్లను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అనేది హైకమాండ్‌తో సంప్రదింపుల తర్వాత క్లారిటీ రానుంది. పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రుల శాఖలను తప్పించి, అంతగా ప్రయారిటీ లేని శాఖల బాధ్యతలు ఇవ్వాలని కొందరు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: