Saturday, 25 April 2026 10:54:55 PM
# తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ # ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి...

కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్..

Date : 25 April 2026 05:25 AM Views : 32

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మీడియా సంస్థలు ప్రజలందరికీ వాస్తవాలు తెలిసేలా వార్తలు ప్రచురించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ తెలిపారు . శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ మాదంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దినపత్రికలు,న్యూస్ చానళ్లు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని తెలిపారు. 2026-28 సంవత్సరాలకు గాను ప్రభుత్వ ఉత్తర్వులు 252, ఆర్.టి. 103 ప్రకారం అర్హత గల వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయడంలో కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. సరైన గుర్తింపు, అర్హత లేనివారు పాత్రికేయులుగా చలామణి కావడంతో అసలైన పాత్రికేయులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో అందిన దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు అల్గువెల్లి రమేష్ రెడ్డి, గొల్లపల్లి సిద్ధార్థ, పార్వతి సురేష్ కుమార్, డేగ సత్యనారాయణ, మొహమ్మద్ ఇమాద్ ఉద్దీన్, రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి, అయినంపూడి నవీన్ కుమార్, గొల్లన నరేష్,బెక్కంసదానందం, మొదంపురం సంతోష్, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బంది కొల్లూరి సంపత్ కుమార్, జి.రవితేజ, మంత్రి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :