Friday, 31 July 2026 10:34:38 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు

చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సి. ఎస్.) శశిధర్ రాజు

Date : 30 October 2025 07:05 PM Views : 282

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సి.ఎస్.) శశిధర్ రాజు తెలిపారు. 2024- 25 రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జిల్లాలోని జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో గురువారం డిసిఎంఎస్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పాటు అవకతవకలలో భాగస్వామ్యులైన రామారావు పేట గ్రామంలోని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానులు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారి, 8 మంది రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ జైపూర్ పోలీస్ స్టేషన్ లో 316 క్లాస్ 5, 318 క్లాస్ 4 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసులో 1 కోటి 39 లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని, జిల్లాలో 740 ఎకరాలలో 6 వేల 322.6 క్వింటాళ్ల ధాన్యమును 8 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి 1 కోటి 39 లక్షల రూపాయలు జమ చేసినట్లుగా ఆన్లైన్ ప్యాడి ప్రొక్యూర్ మెంట్ మేనేజ్మెంట్ సిస్టం లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారని, వీటితో పాటు రవాణా ఖర్చుల కింద 1.90 లక్షల రూపాయల ట్రక్ చిట్టీలు సృష్టించి నమోదు చేశారని తెలిపారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ.ఎస్.డి. శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: