Friday, 31 July 2026 07:13:51 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

Date : 10 December 2025 08:40 PM Views : 278

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ అనిత సూచించారు. వైద్యాధికారి ఆదేశాల మేరకు బుధవారం గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా పాల్గొని వైద్య సిబ్బంది వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాజీపూర్ మరియు మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సందర్శించి తగు సూచనలు జారీ చేశారు. మండలంలోని వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో నిర్వహించిన వైద్య శిబిరంతోపాటు హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశ ఆరోగ్య కార్యకర్తల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సందర్శించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పోలింగ్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని సమయపాలన పాటించాలని, అదేవిధంగా యూనిఫామ్ ను ధరించాలని, మొబైల్ ఫోన్లను తీసుకువెళ్లరాదని, అత్యవసర మందులను ఫస్ట్ ఎయిడ్ గీతలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. అలాగే మందుల వివరములను నమోదు చేసుకొని ఎక్స్పైరీ థియేటర్లను చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్షన్ మరియు కౌంటింగ్ అయ్యేవరకు ఆయా కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున స్థానిక ప్రజాప్రతినిధులతో గాని ఇతరులతో కలిసి తిరగరాదని సూచించారు. అదేవిధంగా 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల కోసం పైలెట్ మరియు ఇతరుల వివరములను దగ్గర ఉంచు కోవాలన్నారు. ఆర్బిఎస్కే బృందము మరియు వారి వాహనంలో సర్వీసులను తీసుకోవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో డాక్టర్ లహరి మరియు వైద్య సిబ్బంది వెంకటేశ్వర్, జిల్లా మాస్ మీడియా అధికారి లక్ష్మణస్వామి, హెచ్ఈఓ వైద్య సిబ్బంది రఘుపతి, సూపర్వైజర్లు ఆశ ఆరోగ్య కార్యకర్తలు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :