Thursday, 30 July 2026 09:25:08 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

కన్నుల పండవగా కార్తీక పౌర్ణమి జాతర

భక్త జన సందోహంతో క్రిక్కిరిసిన ఆలయం

Date : 05 November 2025 07:08 PM Views : 282

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యదేవుని ఆలయం లో కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం భక్తులు కార్తీక పౌర్ణమి జాతరను కన్నుల పండవగా జరుపుకున్నారు. వేలాదిమంది భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సందోహంతో క్రిక్కిరిసిపోయింది. ఉదయం నుండి భక్తులు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా వేలాదిమందిగా తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో సుమారు 1300 జంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఒకేసారి వేలాదిమందిగా భక్తులు తరలిరావడంతో వచ్చిన వారందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎండ బారిన పడకుండా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరును అందుబాటులో ఉంచారు. పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వాలంటీర్లు వచ్చిన భక్తులకు సేవలు అందించారు. గోదావరి వద్ద స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి భద్రత చేపట్టారు. భక్తులు సత్యదేవుని దర్శించుకున్న అనంతరం సమీపాన్ని గల అభినవ శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట గల రావి చెట్టు వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో పాటు డీసీపీ భాస్కర్ ఎసిపి ప్రకాష్ లు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వీరిని సాంప్రదాయ రీతిలో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాలతో అందజేసి శాలువాలతో సత్కరించారు. ట్రాఫిక్ కు ఎలాంటి సమస్య తలెత్తకుండా సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసీనుద్దీన్, అనూష, పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: