ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగాప్రిన్సిపాల్ కస్తూరి సతీష్ మాట్లాడుతూ రక్తహీన వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించాలని ఉద్దేశంతో పాఠశాలలో ఎస్ ఎల్ ఎం స్టూడెంట్ లెడ్ మూమెంట్ కార్యక్రమం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఉచిత కార్యక్రమంలో దాదాపు 70 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని వారు తెలిపారు, రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారికి సేకరించిన రక్తాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇట్టి సేకరించిన రక్తాన్ని తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్క పేషెంట్ కు ఉచితంగా రక్తము అందించబడుతుందని అన్నారు. అలాగే రక్త క్షీణిత జబ్బులైన తల సేమియా, సికిల్ సెల్,హిమోఫిలియా ఈ రక్త క్షీణిత జబ్బులను ప్రభుత్వము వికలాంగులుగా గుర్తించిందని కావున ఈ వ్యాధిగ్రస్తులందరూ వికలాంగుల సర్టిఫికెట్లు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ఉమాశ్రీ ,కమలాకర్, అరుణ, పల్లవి, రెడ్ క్రాస్ సభ్యులు కాసర్ల శ్రీనివాస్ మరియు వారి బృందం, పాఠశాల ప్రిన్సిపాల్ కస్తూరి సతీష్ కుమార్, సంగీత ఉపాధ్యాయులు బాణవత్ శ్రావణ్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News