ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి,జిల్లా కలెక్టర్ కె.హరిత లు పేర్కొన్నారు. శనివారంజిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ దండే విటల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్పి చిత్తరంజన్, రాజస్వ మండలాధికారి లోకేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మంగా, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ , మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. పవిత్ర రంజాన్ పండుగను జిల్లా ప్రజలందరూ శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో కలిసి ఉన్నప్పుడే శాంతి సౌబ్రాతృత్వం వెల్లివిరుస్తుందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులు మైనారిటీ సోదరులకు ఖజ్జురం తినిపించారు. ఈ సందర్భంగా రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, కౌన్సిలర్లు అబ్దుల్లా బిన్ అహ్మద్, సాలం బిన్ అహ్మద్, కార్తిక్, మాజీ డిసిసి విశ్వప్రసాద్ , మాజీ ఎంపీపీ బలేశ్వర్ గౌడ్, వార్డు మెంబర్ జవిద్ గులాం, మైనారిటీ నాయకులు వివిధ పార్టీల నాయకులు ఫయాజ్, సయ్యద్ నిసార్, అమన్, హకీం, అహ్మద్ బిన్ అబ్దుల్లా, అమర్ బిన్ అహ్మద్, తరిక్, ఆబ్బు, సబిర్ హాష్మి, ఇమ్రాన్ హష్మీ లతో పాటు పలువురు అధికారులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News