Friday, 31 July 2026 07:17:22 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా మహా మండల పడి పూజ...

శరణు ఘోషతో పోరెత్తిన అభినవ శబరిమల...! పూజకు హాజరైన మంత్రి అడ్డూరి లక్ష్మణ్

Date : 27 December 2025 08:48 PM Views : 194

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అభినవ శబరిమలిగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గురుస్వామి శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో మహా మండలపూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి ఏట గూడెం అభినవ శబరిమలలో వేలాదిమంది స్వాములు దీక్షలు తీసుకోవడంతో పాటు ఇక్కడే మాలలు కూడా విరమణ చేస్తుంటారు. వచ్చిన స్వాములందరికీ మకరజ్యోతి దర్శనం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని మకర సంక్రాంతి వరకు ఈ ఆలయంలో గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర లోని పలు జిల్లాల నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడే మాల వేసుకుని మాల విరమణ కూడా చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన ఇదే ప్రాంతంలో మకరజ్యోతి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమీపాన్ని సత్యదేవుని ఆలయంతో పాటు సాయిబాబా ఆలయాలు కూడా ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వచ్చిన భక్తులు స్వాములంతా ముందుగ ఆలయాల సమీపంలో గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: