Friday, 31 July 2026 10:46:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎమ్మెల్సీ దండే విటల్ ఎక్స్ ఆఫీసియో సభ్యుడు కాదు...

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Date : 14 February 2026 09:28 PM Views : 248

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మున్సిపల్ సమావేశం నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. ఈ విషయంపై కోనేరు కోనప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. కోనేరు కోనప్ప శనివారం తన నివాసంలో మీడియా ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్సీ దండే విఠల్ మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు లేనప్పటికీ తప్పుడు పత్రాలు సృష్టించి ఓటరు జాబితాలో తన పేరు చేర్చించుకుని ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొని ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ నెల 16న జరగనున్న మున్సిపల్ సమావేశంలో ఇటీవల గెలిచిన కౌన్సిలర్లతో పాటు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ ఆఫిషియో సభ్యులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ఆదేశాలు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు వినియోగించే ప్రజా ప్రతినిధులకే ఎక్స్ ఆఫిషియో హోదా వర్తిస్తుంది. కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దండే విఠల్ పాల్గొనలేదని, ఓటు కూడా వేయలేదని, ఆ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్‌లో ఆయన పేరు లేదని కోనప్ప తెలిపారు. అదనంగా విడుదలైన చేర్పుల జాబితాలో కూడా పేరు లేదని పేర్కొన్నారు. గత 10–15 రోజులలో కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కూడా జరగలేదని చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటర్ లిస్ట్‌లో దండే విఠల్ పేరు ఉన్నట్లు చూపించడం అనుమానాస్పదమని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల కమిషనర్ పూర్తి స్థాయి విచారణ జరిపి, దండే విఠల్‌ను ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా కొనసాగించకూడదని డిమాండ్ చేశారు. ఈ వివాదం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :