ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజల సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెంకట్రావుపేట వైద్యిధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు . బుధవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రజలకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ లక్షెట్టిపేట మండలం లోని కొత్తూర్ గ్రామాన్ని టీబీ రహిత గ్రామంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా రెండవ విడత కార్యక్రమంలో అనుమానితులందరికీ పోర్టబుల్ మోబైల్ ఎక్స్ రే ద్వారా ఎక్స్ రే పరీక్షలు నిర్వహించి టీబీ నిర్ధారణ చేసినట్లు తెలిపారు. గత మూడు రోజుల నుండి కొత్తూర్, దౌడెపల్లి, తిమ్మాపూర్ గ్రామాలలో క్యాంపులు నిర్వహించి 265 మందికి ఎక్స్ రే పరీక్షలు 80 మందికి తెమడ పరీక్షలు, 200 మందికి షుగర్, బీపి తోపాటు సాధారణ పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూపర్ వైజర్లు శోభ , టీబీ సూపర్ వైజర్ సురేష్ ,ఎంఎల్ హెచ్ పి లు సుమలత, అక్షయ , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం యేసువర, మరియు ఆశావర్కర్స్ పాల్గొన్నారు.
Admin
E Nivas News