Thursday, 30 July 2026 10:32:32 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

విద్యార్థుల అభ్యసన సామర్త్యాలు మెరుగుపరచాలి

Date : 23 October 2025 07:38 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తో కలిసి కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ ఎల్ ఎన్) నైపుణ్యాలపై దృష్టి సారించి, ప్రత్యేక పఠన మెరుగుదల ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడం, అక్షరాస్యతను అభివృద్ధి చేయాలని అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో గత సంవత్సరంలో పేలవమైన పనితీరును కనబరిచిన పాఠశాలలపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని, రాబోయే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని అన్నారు. ఎం.ఈ.ఓ లు మండలంలోని ప్రతి పాఠశాలను ఖచ్చితంగా సందర్శించి ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి, రికార్డు పరంగా అన్ని అంశాలపై చర్చించాలని, విద్యార్థులకు బోధనా పద్దతులను, సందేహాల నివృత్తి, విద్యార్థుల హాజరు శాతం మెరుగుదల వంటి అంశాలపై సమావేశాలు నిర్వహించి ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలపై ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మంచి ఫలితాలను రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ప్రతి సబ్జెక్టులో ఉత్తములుగా తీర్చిదిద్దాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడితో శిక్షణ ఇప్పించి విద్యార్థి యొక్క సందేహాలను నివృత్తి చేసి ప్రతిభావంతునిగా తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లాలో సబ్జెక్టుల వారిగా ప్రత్యేక ప్రతిభా పాఠవాలు కలిగిన ఉపాధ్యాయులతో పాఠాలు భోదించి విద్యార్థుల పఠన సామార్త్యాన్ని పెంచాలన్నారు, సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అంతకు ముందు సంవత్సరం ఉత్తీర్ణతలో వెనుకబడిన పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి పాఠశాలపై ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను సమయానుకూలంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: