ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC) ద్వారా దీపావళి కానుకగా మహిళలకు అందిస్తున్న సౌభాగ్యలక్ష్మీ ప్రత్యేక డిపాజిట్ పథకంతో మహిళల ఇంటికి సౌభాగ్యం చేకూరుతుందని మంథని బ్రాంచ్ మేనేజర్ ఉదయశ్రీ అన్నారు. డిపాజిట్ సేకరణలో భాగంగా గురువారం మంథని పట్టణంలోని పలు వీధుల్లో సహకార బ్యాంకు మేనేజర్, బ్యాంకు, సహకార సంఘం సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ డిపాజిట్ల పై ప్రచారం చేస్తూ డిపాజిట్ల సేకరణ చేశారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకు మేనేజర్ ఉదయశ్రీ మాట్లాడుతూ సహకార బ్యాంకులో సాధారణ పౌరులకు 8శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజెన్లు, మహిళలకు 8.5శాతం వడ్డీ రేటు కల్పిస్తున్నామని తెలిపారు. పరిమిత కాలం ఉండే ఈ సదా అవకాశాన్ని బ్యాంకు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డీఈ సందేబోయిన శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్లు పోతరాజు సతీష్ కుమార్, బూడిద వసంత, సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, బ్యాంకు సిబ్బంది అమరేందర్, మహేందర్, మహేశ్వరి, సాయి, సంఘ సిబ్బంది దుబ్బాక సదాశివ్, నారమల్ల విద్యాసాగర్, బొద్దుల సమ్మయ్య, కొత్త స్వప్న, సంగినవేని నరేష్, పైడాకుల రాకేష్, గుడెల్లి మధుమోహన్, రాగం అశోక్, మోత్కూరి సాగర్,తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News