ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహా దేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రా మస్థులు ఘనంగా నిర్వ హించారు. ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ ఎల్పుల సరిత.ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమా జానికి చేసిన సేవలను కొనియాడుతూ,ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయ న చేసిన పోరాటం అంద రికీఆదర్శమనిపేర్కొన్నారు.అనంతరం స్వీట్లు పం పిణీచేశారు.ఈకార్యక్రమంలోఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, వార్డు సభ్యులు శ్రీజ,మన క్క,వెంకటేష్,తేజస్విని, శ్రావణి,అంబేద్కర్ కమిటీ చైర్మన్ సురేందర్,మాజీ సర్పంచ్ సునీత,వివిధ సంఘాల నాయకులు రాకే ష్,బానయ్య,దుర్గయ్శ్యాంసుందర్,శేఖర్.కాంగ్రెస్ పా ర్టీ మండల ఎస్సీ సెల్ అ ధ్యక్షుడు రాజబాబు.తది తరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News