ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రెండున్నర ఏండ్లగా పెండింగ్ పడుతూ వస్తున్న పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్లకు చైర్ పర్సన్ ల నియమాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో 17 చేతి వృత్తుల కుల సంఘాలకు చైర్పర్సన్లను నియమించ నున్నారు. దీంతో గంపెడు ఆశలతో ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుఇప్పుడు తమ ప్రయత్నా లు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం లోతెలంగాణ రాష్ట్ర వ్యవహా రాల ఇంఛార్డ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, భేటీ అయి నామినేటెడ్ పోస్టుల భర్తీ, అభ్యర్థుల ఎంపిక వంటి పలు విషయాలపై సమగ్రంగా చర్చలు జరిపారు.ఈ క్రమంలోనే నామినేటెడ్ పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేసేందుకు.ఈ కసరత్తు ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసంపార్టీ అభివృద్ధి కోసం నిత్యం శ్రమించిన నాయకులను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ఈ నామినేటెడ్ పదవులను కేటాయించడంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఎవరికీ అన్యాయం జరగ కుండాఅన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని సమన్యాయం జరిగేలా ఆశావహుల జాబితాను తయారు చేసినట్లు సమాచారం అందింది.
Admin
E Nivas News