ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ, కల్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ లు అందజేశారు. ఇందిరాఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కులు మరియు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు చెందిన 221 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు కి పలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా బోథ్ రెవెన్యూ డివిజన్ మరియు ఫైర్ స్టేషన్, డిఎస్పీ కార్యాలయం, రోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News