Friday, 31 July 2026 11:39:24 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Date : 03 January 2026 08:51 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మాజీ పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కిసాన్ జి, నాయకులు మాట్లాడుతూ 19వ శతాబ్దంలో స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో, అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు. జనవరి 3న ఆమె జయంతిని జరుపుకోవడం కేవలం ఒక మహానుభావురాలిని స్మరించుకోవడమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడమే అన్నారు. నేటి సమకాలీన సమాజంలో మహిళల అక్షరాస్యత రేటు పెరగడం, మహిళల రాజకీయాల్లో, క్రీడల్లో సాధిస్తున్న విజయాలను చూస్తుంటే, సావిత్రిబాయి ఆశయాలు ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుందన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియమ్మ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో తెలంగాణలోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మహిళల అభ్యున్నతి కోసం, కోటిమంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే లక్ష్యంగా, సంక్షేమాల కోసం మేం అందరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ తెలంగాణలో విద్య, ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. బీసీ వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా విద్య, రవాణా, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యమని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: