ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా మంథని పట్టణంలోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు పట్టణ శాఖ అధ్యక్షుడు సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కొండపాక సత్య ప్రకాష్ లు మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపికి మెజారిటీ స్థానాలలోపట్టం కట్టారన్నారు. ఈ సందర్భంగా మంథని భారతీయ జనతా పార్టీ నుంచి మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా రానున్న తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లలో బిజెపి విజయ దుందుభి మోగించడంలో తెలంగాణ ప్రజలు ముందుంటారని, మంథని పట్టణంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో స్థానిక ప్రజలు బిజెపికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం బిజెపి వార్డు సభ్యులు బూడిద తిరుపతి, సీనియర్ నాయకులు నారమల్ల కృష్ణ, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఎడ్లసాగర్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కారంగుల రాజశేఖర్, పట్టణ కార్యదర్శులు మాచిడి శ్రీధర్, పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వడ్నాల శ్రీనివాస్, నాయకులు గుడ్ల గురువేష్, సబ్బని రాకేష్, రాకేష్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News