Thursday, 30 July 2026 06:53:10 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బిజెపి నిర్లక్ష్యమేతో బీసీ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

Date : 11 October 2025 07:51 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బిజెపి ప్రభుత్వ కుట్రతోనే బీసీ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, చెన్నూర్ మండల కార్యదర్శి బోడంకి చెందులు మాట్లాడుతూ కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం కుత్రతోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకై అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్,రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం మూలంగానే బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధిని బిజెపి అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధత రాకపోవడానికి బిజెపి కారణమన్నారు. దీని మూలంగా రాష్ట్ర హైకోర్టు ఎన్నికల పైన స్టే విధించడం జరిగిందన్నారు. ఒకవైపు బీసీల కోసం పనిచేస్తున్నామని చెప్పుతూ మరోవైపు బీసీల ఎదుగుదలను ఓర్వ లేకుండా బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమైన విషయం అని ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండి కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బిజెపి ఎంపీ,ఎమ్మెల్యేలకు మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యకుండ బిజెపి దొంగ నాటకాలడుతుందన్నారు. దిన మూలంగానే బీసీలు అన్యాయానికి గురౌవుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై సంఘాలు,మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో శామల ఉమారాణి, కుందారపు చంద్రన్న, భోగే నాగజ్యోతి, బొండ్ల సరిత, సిడం సమ్మక్క, బోయిరే రమాదేవి, కరీంభీ, గట్టక్క, బొందయ్య, బానయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :