ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బిజెపి ప్రభుత్వ కుట్రతోనే బీసీ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి, చెన్నూర్ మండల కార్యదర్శి బోడంకి చెందులు మాట్లాడుతూ కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం కుత్రతోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకై అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్,రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం మూలంగానే బీసీలు రిజర్వేషన్లు పొందలేకపోతున్నారన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధిని బిజెపి అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధత రాకపోవడానికి బిజెపి కారణమన్నారు. దీని మూలంగా రాష్ట్ర హైకోర్టు ఎన్నికల పైన స్టే విధించడం జరిగిందన్నారు. ఒకవైపు బీసీల కోసం పనిచేస్తున్నామని చెప్పుతూ మరోవైపు బీసీల ఎదుగుదలను ఓర్వ లేకుండా బిల్లును అడ్డుకోవడం దుర్మార్గమైన విషయం అని ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండి కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బిజెపి ఎంపీ,ఎమ్మెల్యేలకు మోడీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు అమలు చెయ్యకుండ బిజెపి దొంగ నాటకాలడుతుందన్నారు. దిన మూలంగానే బీసీలు అన్యాయానికి గురౌవుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకై సంఘాలు,మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో శామల ఉమారాణి, కుందారపు చంద్రన్న, భోగే నాగజ్యోతి, బొండ్ల సరిత, సిడం సమ్మక్క, బోయిరే రమాదేవి, కరీంభీ, గట్టక్క, బొందయ్య, బానయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News