Thursday, 30 July 2026 11:58:20 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపిన పీవీ

ఐటి మంత్రి శ్రీధర్ బాబు

Date : 23 December 2025 04:11 PM Views : 276

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : దేశాన్ని ఆర్థిక సంస్కరణల దిశగా నడిపించిన మహా మేధావి పీవీ నరసింహారావు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూర దృష్టి కలిగిన నేత పీవీ అని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లి, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. బహు భాషావేత్త, పండితుడు, రచయితగా అనేక రంగాల్లో భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచారన్నారు. పీవీ దూరదృష్టి సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, వారి ఆలోచనలు, ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, విద్యుత్ సలహా మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకులు మంథని సత్యం, మాజీ సర్పంచ్ ఉడ్నాల శ్రీనివాస్, నాయకులు పోలు శివ, మంథని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :