ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ లో జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారంనిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ మరియు జూనియర్ చెస్ పోటీలలో లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థి వేముల అర్జున్ అండర్ 14 కేటగిరి లో మొదటి బహుమతి సాధించాడు. చెస్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన అర్జున్ ను పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్. మంగతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది,పలువురు పట్టణ ప్రజలు అభినందించారు.
Admin
E Nivas News