Friday, 31 July 2026 07:23:56 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

విద్యాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ పాటు పడుతా...! నేటి బాలలే రేపటి పౌరులు

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 06 January 2026 05:28 PM Views : 178

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యాభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని నేటి బాలలే రేపటి పౌరులని వారి యొక్క చదువుతోనే వారి జీవితమే అభివృద్ధి చెందుతుందని బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని నారాయణ్ పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 10 లక్షలతో మంజూరు అయిన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విద్యార్థులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి విద్య అవసరమని, విద్యాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ పాటు పడతానని అన్నారు. అడగకపోయిన గ్రామానికి 1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించాం, 40 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు కేసీఆర్ నాణ్యమైన ఉచిత విద్యను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర లక్ష్మీ ఉష, ఉప సర్పంచ్ జాదవ్ అనూష బాయి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నానక్ సింగ్, జాదవ్ గణేష్, నాయకులు అనిల్ యాదవ్, ఎంపిడిఓ, పచు సింగ్, గులాబ్, రాజు, నజీర్, పవన్, అశోక్, రాం, మరియు మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు రమేష్, కృష్ణ, జీవన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :