ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ 2026.27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఈనెల 6వ.తేదీ నుండి 25వ తేదీ వరకు ఆ న్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తు న్నామని హాసన్ పర్తిగురు కుల కళాశాల ప్రిన్సిపల్ పి. సుధా కృష్ణ.మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దరఖా స్తులు చేసుకోవచ్చని పేర్కొ న్నారు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థు లకు సి.ఓ.ఈ.వృత్తి విద్యలు సైనిక కళాశాలలో శిక్షణ ఇ వ్వడం జరుగుతుందని తె లిపారు. అంతేగాక జూని యర్ కళాశాలలోఎంపీసీ, బైపీసీ, ఎంఈసి, సీఈసీ, హెచ్ ఈసి గ్రూపు లలో ప్రవేశం పొందవచ్చు అని తె లిపారు పూర్తి వివరాల కో సం సమీపంలోని గురుకుల కళాశాలలో సంప్రదించవచ్చని హసన్పర్తి ప్రిన్సిపల్ తెలిపారు.
Admin
E Nivas News