ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్ లో ఈసారి దాదాపు 850 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. అందులో మన దేశం నుంచి కేవలం కృష్ణ మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించారు. 850 లో టాప్50 ఆర్టిస్టులలో కృష్ణ ని కూడా ఎంపిక చేసి, ఫీచర్డ్ ఆర్టిస్ట్ గా గౌరవించారు. 21, 22 తేదీలలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కృష్ణ మొదటి రోజు మహాభారతంలోని మయసభ లో ప్రస్తావించబడిన మాయాకొలను ను చిత్రీకరించారు. ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందుతున్న ఈ త్రీడి ఆర్ట్ మన మహాభారతంలోనిదేనని, అందుకే ఈ మాయకొలనుని చిత్రీకరించానని కృష్ణ తెలిపారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విషయాన్ని తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ, దేశగొప్పదనాన్ని విదేశాల్లో చాటడం తనకు గర్వంగా ఉంటుందని తెలిపారు. కృష్ణ వేసిన త్రీడి ఆర్ట్ చూసి, అమెరికా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. తనను ఆహ్వానించిన ఈవెంట్ ఆర్గనైజర్స్ సుజానే, షరాన్ లకి కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. The artist from Bharath, The Art from Mahabharat అని అమెరికా మీడియా అభిప్రాయపడింది. ఈ మంగళవారం ఫ్లోరిడా లోని కల్చరల్ కౌన్సిల్ లో కృష్ణ త్రీడి చిత్రాలు ప్రదర్శించే అవకాశం ఉంది.
Admin
E Nivas News