ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రియల్ టైం డేటా ఎంట్రి చేపట్టాలని మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ ట్యాబ్ ఆపరేటర్లకు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని కార్యాలయంలో సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లకు అవహగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే అప్పటికప్పుడు ట్యాబ్ లో డేటా ఎంట్రి చేయాలని, ఖచ్చితంగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే జీపిఎస్ ఉన్న వాహనాల ద్వారా మాత్రమే రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలని అన్నారు. వరి ధాన్యం లోడ్ చేసే సమయానికి మీకు ఏ మిల్లు కేటాయించారో ముందే తెలియదని, ఇకపై మాన్యువల్ మిల్లు అలాట్ మెంట్ ఉండదని అన్నారు. ఆన్ లైన్ లో ట్రక్ చిట్ జనరేట్ చేసిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్ గా రైస్ మిల్లు పేరు చూపిస్తుందని, ట్రక్ చిట్ లో ఏ మిల్లు పేరు చూపిస్తుందో ఆ మిల్లు కు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సెంటర్ ఇంచార్జీలు తప్పనిసరిగా రికార్డు ల్లో ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ట్రాన్స్పోర్ట్ చేసిన ధాన్యం వివరాలు విధిగా నమోదు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్లతో ధాన్యాన్ని శుభ్రపర్చాలని, 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు సెంటర్ కు ధాన్యం తీసుకువచ్చే సమయంలోనే వారి నుంచి అదార్ కార్డు జీరాక్స్, పట్టా పాస్ పుస్తకం జీరాక్స్, బ్యాంకు పాసు పుస్తకం జీరాక్స్, ఓటిపి వచ్చే సెల్ నంబర్ ను సేకరించాలని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగగుండా తగు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
Admin
E Nivas News