Thursday, 30 July 2026 08:14:04 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రియల్ టైం డేటా ఎంట్రి చేపట్టాలి...

మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్

Date : 28 April 2026 05:45 AM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రియల్ టైం డేటా ఎంట్రి చేపట్టాలని మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ ట్యాబ్ ఆపరేటర్లకు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని కార్యాలయంలో సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లకు అవహగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే అప్పటికప్పుడు ట్యాబ్ లో డేటా ఎంట్రి చేయాలని, ఖచ్చితంగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే జీపిఎస్ ఉన్న వాహనాల ద్వారా మాత్రమే రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలని అన్నారు. వరి ధాన్యం లోడ్ చేసే సమయానికి మీకు ఏ మిల్లు కేటాయించారో ముందే తెలియదని, ఇకపై మాన్యువల్ మిల్లు అలాట్ మెంట్ ఉండదని అన్నారు. ఆన్ లైన్ లో ట్రక్ చిట్ జనరేట్ చేసిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్ గా రైస్ మిల్లు పేరు చూపిస్తుందని, ట్రక్ చిట్ లో ఏ మిల్లు పేరు చూపిస్తుందో ఆ మిల్లు కు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సెంటర్ ఇంచార్జీలు తప్పనిసరిగా రికార్డు ల్లో ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ట్రాన్స్పోర్ట్ చేసిన ధాన్యం వివరాలు విధిగా నమోదు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్లతో ధాన్యాన్ని శుభ్రపర్చాలని, 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు సెంటర్ కు ధాన్యం తీసుకువచ్చే సమయంలోనే వారి నుంచి అదార్ కార్డు జీరాక్స్, పట్టా పాస్ పుస్తకం జీరాక్స్, బ్యాంకు పాసు పుస్తకం జీరాక్స్, ఓటిపి వచ్చే సెల్ నంబర్ ను సేకరించాలని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగగుండా తగు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :