Sunday, 26 April 2026 02:07:01 AM
# భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్ # ఆశ ఉండొచ్చు.. అత్యాశ ఉండొద్దు. # ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు కీలక మార్పులు చేశాం.. # ఈ నెల 27న ప్రజావాణి రద్దు # ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి

భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్

Date : 25 April 2026 11:13 PM Views : 8

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్ల కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. “డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ” పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడులు పెట్టమని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలు థాకూర్ శివరంజని బాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ శనివారం తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. 5 శాతం నుండి 20 శాతం వరకు లాభాలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారు. వీరిలో థాకూర్ శివరంజని బాయి అరెస్టు కాగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితురాలిని ఏప్రిల్ 24న సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా, ఈ నిందితులు గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డట్లు బయటపడింది. కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, లల్లగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లువెల్లడించారు.2021 ఆగస్టు నుండి 2023 జనవరి మధ్యకాలంలో కాగజ్‌నగర్ పట్టణంలో నివసిస్తూ ప్రజలను నమ్మబలికి డబ్బులు తీసుకుని పరారైనట్లు సమాచారం.ఇప్పటివరకు మరికొందరు బాధితులు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, టౌన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజు, మహిళా కానిస్టేబుళ్లు లక్ష్మి, జోష్ణ, బ్లెస్సి, శమీనా, కానిస్టేబుల్ విజయ్‌లను ఎస్పీ అభినందించారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :