ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండలం గద్దెరాగడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయాన్ని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ (ఎజిఎం) రాధాకృష్ణ, లీడ్ డిస్టిక్ మేనేజర్ తిరుపతి, శాఖ మేనేజర్ సంజీవ్ తలకోటి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్దెరాగడి శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజలకు, బ్యాంకు వినియోగదారులకు సేవలను మరింత అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. పొదుపు, బీమా, పెన్షన్, పెట్టుబడులు ఇతర అనేక అంశాలలో ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. శాఖ కార్యాలయం అభివృద్ధికి బ్యాంక్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News